నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:11

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ*

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ 

అనారోగ్యంతో స్వర్గస్తులైన రజిని కుమారి కూతురు ఐశ్వర్య

సూర్యాపేటలోని ఆమె స్వగృహంలో పరామర్శించిన మంత్రి

 సూర్యాపేట

భాజపా నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య స్వర్గస్తురాలయింది. ఏకైక కుమార్తెను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న రజనీకుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనీకుమారిని అడిగి తెలుసుకున్నారు.

మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ధి శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:07

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ

- న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం 

చర్ల

గిరిజనులు ఎంతో కాలంగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీలపై అటవీశాఖ అధికారులు వేధింపులు ఆపాలని చర్ల దుమ్ముగూడెం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్‌ చేశారు. చర్ల మండలం కలివేరు గ్రామపంచాయతీ లింగాల కాలనీలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలివేరు గ్రామం నుండి నుండి చర్ల తహశీల్దార్‌ కార్యాలయం వరకు ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు.

కు

అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.  అనంతరం సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ గతంలో ఎంతో మంది అధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని ఆయన పట్టించుకునే నాధుడు లేరన్నారు. ఇప్పటికైనా గ్రామసభ నిర్వహించి అర్హులైన వారందరికీ పోడు పట్టాలు అందజేయాని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు నరేష్ సమ్మక్క, రాజు,నాగలక్ష్మి రామలక్ష్మి కనక వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 17:02

అక్టోబర్ 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు

అక్టోబర్ 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు..

రేపటి సడక్ బంద్ ను విజయవంతం చేయండి.. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి..

సడక్ బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలి..

ఈ అంశాలపై గతంలో ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల పక్షం సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ మేరకు పులుపు నిచ్చారు. 

TSPSC వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయి.

ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ , తెలంగాణ జన సమితి, BSP, CPI, CPM, న్యూ డెమోక్రసీ, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, PDSU,SFI విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.

అక్టోబర్ 14 న ఉదయం 10.30 గంటల నుండీ 12.30 వరకూ జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని కోరుతున్నాము.

.

అక్టోబర్ 14 రాస్తారోకో పాయింట్స్.

1. మహబూబ్ నగర్ నుండీ హైదరాబాద్ రహదారిలో మహబూబ్ నగర్,జడ్చర్ల, షాద్ నగర్,శంషాబాద్ ..

2.వరంగల్ నుండీ హైదరాబాద్ రహదారి పై వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘటకేశ్వర్, 

3.రామగుండం నుండీ హైదరాబాద్ రహదారిపై రామగుండం పెద్దపల్లి,కరీం నగర్, సిద్దిపేట, గజ్వేల్, శామీరు పేట, తూం కుంట 

4. ఖమ్మం నుండీ హైదరాబాద్ రహదారిలో ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నక్రేకల్, నార్కట్ పల్లి, చిట్యాల, చౌటుప్పల్, హయత్ నగర్..

అక్టోబర్ 14. రాస్తారోకో డిమాండ్లు.

1.ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా TSPSC సభ్యులను తొలగించి ,TSPSC చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలి. 

2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.

3.DSC పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు పెంచాలి.(బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా )

4.పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి.

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 16:57

*తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?*

తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?  

హైదరాబాద్:అక్టోబర్ 13

 తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది.

ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20,నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు.

షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది.

ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో వంద బలగాలను తెలంగాణ రాష్ట్రానికి సీఈసీ పంపించింది...

నిజందాగదుక్షణంఆగదు

Oct 13 2023, 16:52

*పోచంపల్లి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి*

పోచంపల్లి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఖాతాదారులకు అత్యుత్తమ సేవలందిస్తున్న పోచంపల్లి బ్యాంకు ఖాతాదారులందరికీ ఒక్క లక్ష రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ఎంతో ఉపయోగకరమని పెన్ పహాడ్ మండల అభివృద్ధి అధికారి బి శ్రీనివాస్ తెలిపారు.

అనంతారం గ్రామానికి చెందిన మెండు సైదిరెడ్డి విద్యుత్ తీగల తగిలి మృతి చెందగా వారి తల్లి మెండు జయమ్మకు శుక్రవారం లక్ష రూపాయల ప్రమాద బీమా చెక్కును పోచంపల్లి బ్యాంకు ద్వారా అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు శాఖ మేనేజర్ ఎం.శ్రీ కిషన్ మాట్లాడుతూ కస్టమర్లకు పోచంపల్లి బ్యాంక్ అందిస్తున్న సేవలకు గాను జాతీయస్థాయిలో ఉత్తమ బ్యాంకుగా అవార్డును పొందడం జరిగిందని తెలిపారు. తమ బ్యాంకు డిపాజిట్ దార్లకు అత్యధిక వడ్డీని చెల్లిస్తున్నట్లు, వ్యవసాయదారులకు, చేతివృత్తుల వారికి,వ్యాపారస్తులకు అతి తక్కువ వడ్డీకే వారి అవసరాల మేర రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది టీ క్రాంతి కే మల్లికార్జున్ బి. కవిత వి. శృతి 

జి. సైదులు, జి నీరజ్ కుమార్

 పి హిందూ కుమార్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 12 2023, 09:10

ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత

ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత

5 రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్‌ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌ యాప్స్‌ను ప్రవేశపెట్టింది.

అధికారులకు ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌

ఐదు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 తెలంగాణ): ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్‌ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్‌ఎంఎస్‌, పౌరుల కోసం సీ-విజిల్‌ యాప్స్‌ను ప్రవేశపెట్టింది. తనిఖీలలో దొరికే నగదు, మద్యం, డ్రగ్స్‌, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి, డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి, ఐటీ శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి 'ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ (ఈ-ఎస్‌ఎంఎస్‌) అనే యాప్‌ను వినియోగిస్తున్నది.

ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అధికారులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఎప్పటికప్పుడు వివరాలను ఈఎస్‌ఎంఎస్‌ యాప్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో దొరికిన నగదు, మద్యం, డ్రగ్స్‌ వంటి వివరాలను సరైన సమయంలో నమోదు చేయకపోవడం వల్ల కొంత దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ-ఎస్‌ఎంస్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అక్రమాలపై ఫిర్యాదుకు..

ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్‌ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా 'సీ-విజిల్‌’ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్‌స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్‌ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ యాప్‌ను గూగుల్‌, యాపిల్‌ ప్లే స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే పది లక్షల మంది పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్‌ భావిస్తున్నది.

నిజందాగదుక్షణంఆగదు

Oct 12 2023, 08:49

ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి: వి. కృష్ణ మోహన్ నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)

ఇస్రో ప్రయివేటీకరణను ఆపాలి

రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి ఇస్రో స్వీయ శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలి

తమిళనాడులో ఏర్పాటు చేయనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రెండో స్పేస్‌పోర్ట్‌ (అంతరిక్ష పరిశోధన కేంద్రం) నుండి ఇస్రో శాటిలైట్లను కూడా ప్రయోగించడానికి అనుమతించాలని, ప్రయివేటీకరణను ఆపాలని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) జాతీయ అధ్యక్షులు వి.కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ (షార్) స్పేస్‌పోర్ట్‌ నుంచి ఇస్రో స్వీయ వ్యోమ నౌకలను పంపడంతో పాటు ప్రయివేటు వ్యోమనౌకలను, కృత్రిమ ఉపగ్రహాలను పంపిస్తున్న విధంగా తూత్తుకుడి జిల్లాలోని కులశేఖరపట్టణంలో నిర్మించే రెండో స్పేస్‌పోర్ట్‌ నుండి కూడా ఇస్రో స్వీయ శాటిలైట్లను ప్రయోగించడానికి అనుమతించాలని కోరారు. అయితే ఇక్కడ నిర్మించే స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వి)ను ప్రైవేట్‌ రంగం మాత్రమే వినియోగిస్తుందని, ఇస్రో రాకెట్లు ప్రయోగించబోరనే నిర్ణయాన్ని తప్పుబట్టారు.

సుమారు రెండేళ్లలో అందుబాటులోకి రానున్న స్పేస్‌పోర్టు కోసం అవసరమైన రెండు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం ఇస్రోకు అప్పగించినట్లు, ఇక నుంచి ప్రయివేటు రంగానికి సంబంధించిన వ్యోమనౌకలను, ఉపగ్రహాలను మాత్రమే కులశేఖరపట్టణంలో నిర్మించే స్పేస్‌పోర్టు నుంచి పంపించనున్నారని వి. కృష్ణ మోహన్ తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలని, ప్రయివేటు రంగ శాటిలైట్లను మాత్రమే నింగిలోకి తీసుకెళ్లేందుకు ఈ ప్రయోగ కేంద్రాన్ని వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఐఎన్‌-స్పేస్‌) చైర్మన్‌ను కోరారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 28 2023, 09:33

ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ప్రారంభించిన ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే

ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ప్రారంభించిన ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే

పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, పరిశీలకురాలు దీపదాస్, మూన్షి, మీనాక్షి నటరాజన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, రోహిత్ చౌదరీ, పొన్నం ప్రభాకర్, ప్రేమ్ సాగర్ రావ్ గార్లతో పాటు తదితరులు

మధుయాష్కి గౌడ్ గారు మాట్లాడుతూ....

మత ఘర్షణలకు ఒవైసీ ,బీజేపీ కారణం..

అసుదూద్దిన్ ఒవైసీ తండ్రి సలవుద్దిన్ , బీజేపీ నేత అలే నరేంద్ర లు కాదా ..

దేశంలో మత సామరస్యన్ని రెచ్చగిట్టేది వీళ్లిద్దరు..

కాళేశ్వరంలో 49 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ చెబుతుంది..

కాంగ్రెస్ పార్టీ అంటే నిజాయితీ , నిబద్ధత..

విభజన చట్టంలో హైదరాబాద్ రాజధాని 

కొండా లక్షణ్ బాపూజీ బిక్ష తో మీరు పార్టీ పెట్టుకున్నారు..

మీరు కనీసం కొండ లక్ష్మణ్ బాపూజీ నివాళులు అర్పించలేదు..

కేటీఆర్ మి సతీమణి ఎక్కడి నుండి వచ్చింది..

2 లక్షల ఉద్యోగాల కల్పనకు క్యాలెండర్ విడుదల చేస్తాం..

నిరుద్యోగ భృతి ఉంటుంది..

రాహుల్ గాంధీ వరంగల్ సభలో పెట్టినట్టు 2 లక్షల రుణమాఫీ కూడా ఉంటుంది..

నిజందాగదుక్షణంఆగదు

Sep 28 2023, 07:01

వారంటీ లేని పార్టీ గ్యారెంటీలా?.. మంత్రి కేటీఆర్

వారంటీ లేని పార్టీ గ్యారెంటీలా?

'మొండి చేయికి ఓటేస్తే బతుకులు ఆగమైతయ్‌. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం అంధకారమైపోద్ది' అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు.

65 ఏండ్లు పాలించి రూ.200 పింఛన్‌ ఇయ్యనోడు రూ.4 వేలు ఇస్తా.. రూ.40 వేలు ఇస్తానంటూ అడ్డం పొడువు నరుకుతుండ్రని, అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వడానికి చేతకాని వాళ్లను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు.

మొండి చేయికి ఓటేస్తే ఆగమైపోతం

వాళ్లువస్తే ఏడాదికో ముఖ్యమంత్రి

65 ఏండ్లు పాలించి 200 పింఛన్‌ ఇయ్యనోడు రూ.4 వేలు ఇస్తడా?

ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

డబ్బు, మద్యం పంచను.. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచను. మీకు పనికొచ్చే నాయకుడిగా, పనిచేసే నాయకుడిగా పేదలకు, రైతులకు, అక్కాచెల్లెండ్లకు నా శక్తి మేరకు పనిచేస్తా. నన్ను ఆశీర్వదిస్తే మీకు జీవితాంతం రుణపడి ఎక్కువ పనిచేస్తా. ఎక్కడా ఎవరికీ అన్యాయం చేయబోను. బతికినన్ని నాళ్లు తప్పకుండా సిరిసిల్ల ప్రజలకే సేవచేస్తా. మీరు ఉండమన్న రోజులు ఇక్కడే ఉంటా.

-మంత్రి కేటీఆర్‌

 'మొండి చేయికి ఓటేస్తే బతుకులు ఆగమైతయ్‌. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రాష్ట్రం అంధకారమైపోద్ది' అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. 65 ఏండ్లు పాలించి రూ.200 పింఛన్‌ ఇయ్యనోడు రూ.4 వేలు ఇస్తా.. రూ.40 వేలు ఇస్తానంటూ అడ్డం పొడువు నరుకుతుండ్రని, అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇవ్వడానికి చేతకాని వాళ్లను ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తదా? అని నిలదీశారు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవర్‌తో ఏడాదికో ముఖ్యమంత్రిని మారుస్తారని. ఐదుగురు కృష్ణులు గ్యారెంటీ అని, ఎప్పుడు ఎవరు దిగుతాడో తెలియదని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో బుధవారం మంత్రి కేటీఆర్‌ పర్యటించారు.

మండల కేంద్రంతోపాటు కోళ్లమద్ది, లింగన్నపేట, నర్మాల గ్రామాల్లో 369 డబుల్‌ బె డ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం నమాజ్‌చెరువు పక్కన మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 11 సార్లు ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు కనీసం కరెంటు, తాగునీళ్లు, సాగునీరిచ్చే తెలివిలేదని, పింఛను ఇచ్చే ముఖం లేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ రూ.లక్ష రుణమాఫీ అంటే వాళ్లు రూ.2 లక్షలు ఇస్తమమంటున్నరని, 24 గంటల కరెంటు ఇస్తామంటే 48 గంటలని చెప్తున్న కాంగ్రెసోళ్ల కల్లబొల్లి మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. వాళ్లు ఇచ్చేది లేదు.. సచ్చేది లేదని, గందరగోళం సృష్టించి నాలు గు ఓట్లు డబ్బాలో వేసుకుని అవతల వడాలన్నదే వాళ్ల నీతి అని విమర్శించారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల నుంచి పైసలు తెచ్చి ఇక్కడ పంచి తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సీజన్‌ వచ్చిందని, కాంగ్రెసోల్లు, బీజేపోళ్లు పైసలు ఇచ్చినా తీసుకోండ్రి కానీ, ఇమానాలు, ప్రమాణాలు చేయవద్దని, ఓటు మాత్రం తప్పకుండా మీకు పనిచేసే కేసీఆర్‌ ప్రభుత్వానికే వేయాలని విజ్ఞప్తి చేశారు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీయాలని కేటీఆర్‌ సూచించారు.

 

నెరవేరిన రైతుల దశాబ్దాల కల

మెట్ట ప్రాంత రైతుల దశాబ్దాల కల సీఎం కేసీఆర్‌ వల్లే నెరవేరిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మల్లన్నసాగర్‌ నుంచి ఎగువ మానేరుకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మల్కపేట రిజర్వాయర్‌తో కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని చెరువులను నింపుతూ ఎగువ మానేరులోకి నీటిని ఎత్తిపోయనున్నట్టు మంత్రి చెప్పారు. మల్కపేట రిజర్వాయర్‌ను పూర్తి చేసినందుకు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొత్తం 1967 మందికి ప్రథమ ప్రాధాన్యంగా గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు.

గంభీరావుపేటను మున్సిపాలిటీగా చేస్తా: కేటీఆర్‌

గంభీరావుపేట మండలం లింగన్నపేట, గంభీరావుపేట గ్రామాల మధ్య మానేరు వాగుపైన రూ.13.50 కోట్లతో నిర్మిస్తున్న హైలెవెల్‌ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. లింగన్నపేటకు చేరుకొని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.5 కోట్లతో కొత్తపల్లి-దుబ్బాక రోడ్డు విస్తరణ, లైటింగ్‌ పనులకు శంకుస్థాపన చేశారు. గంభీరావుపేటను మున్సిపాలిటీగా చేస్తానని, మండల కేంద్రంలో రూ.3 కోట్లతో అధునాతన మార్కెట్‌, రూ.3 కోట్లతో లక్ష్మీపూర్‌ రోడ్డును నిర్మిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనురాగ్‌ జయతి, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Sep 27 2023, 21:02

అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించబోయే ఐటి హబ్ ప్రారంభోత్సవానికి పలు ఐటి కంపెనీలను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించిన ఎమ్మెల్యే కంచర్ల

ఫ్లాష్.. ఫ్లాష్

 అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ ప్రారంభించబోయే ఐటి హబ్ ప్రారంభోత్సవానికి పలు ఐటి కంపెనీలను జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించిన ఎమ్మెల్యే కంచర్ల..

ఈరోజు సాయంత్రం.. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. అక్టోబర్ 2వ తేదీ పురపాలక & ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ నల్లగొండలో ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక ఐటీ హబ్ కు ఆహ్వానిస్తూ పలు ఐటి కంపెనీలతో.. జూమ్ మీటింగ్ లో ఆహ్వానించారు.

 

అదేవిధంగా గత నెలలో నిర్వహించిన జాబ్ మేళా సందర్భంగా... హాజరైన వివిధ కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడుతూ.. స్థానిక యువతను ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునే విధంగా.. వారిని అభ్యర్థించారు.

 సకల సౌకర్యాలతో..నల్లగొండ ఐటి టవర్ అక్టోబర్ రెండు నా ప్రారంభించకపోతున్నందున...

 వెంటనే తమ కంపెనీలను నల్గొండలో ఏర్పాటు చేసుకొనుటకు.. తరలి రావలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు

 

ఈ జూమ్ మీటింగ్ లో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి శాఖ ప్రతినిధి విజయ రంగీన్ గారు... టాస్క్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారు.. పలువురు ఐటీ కంపెనీల యజమానులు పాల్గొన్నారు